*ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 21 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
జయప్రదం చేయాలి
పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ విజ్ఞప్తి చేశారు.
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీవీ కాలనీలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి ఒకటి నుండి నాలుగో తేదీ వరకు జరుగునున్న బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ సింగరేణి ఉద్యోగులను విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఏరియా కొండాపురం భూగర్భ గనిలో జరిగిన బ్రహ్మోత్సవాల నిర్వహణ,ఆర్థిక సహకారం ప్రచార కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు. మణుగూరు ఏరియా ఉద్యోగుల సింగరేణి యాజమాన్యం మరియు భక్తుల సహకారంతో పివి కాలనీలో నిర్మించుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా జరుపుకుంటున్నామని స్వామివారి కరుణ కటాక్షాలతో జరుగునున్న బ్రహ్మోత్సవాల నిర్వాణకు ఆర్థికంగా సహకరించాలని లోక కళ్యాణార్థం కన్నుల పండువగా, రంగ రంగ వైభవంగా ఎంతో ఘనంగా జరగనున్న బ్రహ్మోత్సవాలలో కుల మతాలకతీతంగా కుటుంబ సభ్యులతో అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని చివరి రోజున జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కొండాపురం భూగర్భ గని ఎస్ ఓ యం పి నరసింహారావు, అడిషనల్ మేనేజర్ ఆర్ మధు బాబు, పీకే ఓసి రక్షణ అధికారి ఎం లింగ బాబు, కార్మిక సంఘాల నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, పి రామకృష్ణ, నాగేల్లి వెంకట్, కట్కోజుల శ్రీనివాస్, యస్ డి నా సర్ పాషా,సంక్షేమ అధికారులు డి నరేష్, కె అరుణ్ తేజ,సర్వేయర్ రాజేశ్వరరావు, టి వై ఎస్ సి ఆ సైదులు, ట్రైనీ అండర్ మేనేజర్లు కుంచపు భార్గవి, నవ్య, మైనింగ్ స్టాప్ మరియు సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
by Naddi Sai
Updated On: February 21, 2025 9:54 pm
