అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన ఏబీవీపీ నాయకులు రోహిత్..

ఏబీవీపీ
Headlines:
  1. ABVP నాయకుడు రోహిత్: అత్యవసర పరిస్థితిలో రక్తదానం
  2. రక్తం దానం: మానవత కోసం యువత ముందుకు రావాలని పిలుపు
  3. గణేష్ కు రక్తం అందించిన ABVP నాయకుల సేవ

జిల్లా రక్తదాతల సేవా సమితి
నిర్వాహకులు

బోనగిరి శివకుమార్
ముదాం శ్రీధర్ పటేల్

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం నవంబర్ 01:

కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణేష్ అనే పేషంట్ కి తన అనారోగ్యం నిమిత్తం అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో పేషంట్ కుటుంబసభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో ఒక్క ఫోన్ కాల్ తో వెంటనే స్పందించిన ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ మాట్లాడుతూ దేశసేవ నిమిత్తమై తాను ఎల్లప్పుడూ ఏబీవీపీ కార్యకర్తగా ముందుంటామని తెలియజేశారు.ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ.రక్తం దానం చేస్తే మళ్లీ రక్తం వస్తుంది కానీ, రక్తం అందక పోయిన ప్రాణం తిరిగి రాదు.మనం చేసే రక్తదానం వలన వెలకట్టలేని విలువైన ప్రాణం రక్షించబడుతుంది
యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది.ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన విద్యార్థి నాయకులు రోహిత్ కి జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now