కామారెడ్డి జిల్లా మత్స్యకారుల సదస్సు

ప్రతి మత్స్య సొసైటీ జల వనరులకు సరిపడేంత చేప,రొయ్య పిల్లల కొనుగోలు కోసం సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలి

 

– మత్స్యకారుల కామారెడ్డి జిల్లా సదస్సు లో తీర్మానం.

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 14

 

 

జిల్లాలో ప్రతి మత్స్య సొసైటీ జల వనరులకు సరిపడెంతా ఉచిత చేప,రొయ్య పిల్లలను మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని టి ఎం కె ఎం కె ఎస్ మత్స్యకారుల కామారెడ్డి జిల్లా సదస్సులో తీర్మానం చేశారు. సోమవారం తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా సదస్సు జిల్లా కేంద్రంలోని విజ్ఞాన భారతి డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఉచిత చేప రొయ్య పిల్లల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన చేయకపోవడం రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎలాంటి టెండర్లు లేకుండా మత్స్య సొసైటీ ఖాతాలో నగదు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో అర్హులైన అనేకమంది మత్స్యకారులకు సొసైటీలో కొత్తగా సభ్యత్వం తీసుకొని ప్రభుత్వ సంక్షేమలు పొందే విధంగా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో భూస్వాములు దళారీలో పెద్ద ఎత్తున చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారని, దీంతో మత్స్యకారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం చెరువులు, కుంటలు సాటిలైట్ ద్వారా సర్వే చేయించి ఫెన్సింగ్ వేయించాలని డిమాండ్ చేశారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్సీడీసీ, ఎన్ఎఫ్డీబీ నిధులను ఎత్తివేయడాన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆధునాతన మైన సౌకర్యాలతో హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మించి వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మామిండ్ల జగదీష్, మత్స్య మహిళా విభాగం రాష్ట్ర కోకన్వీనర్ బక్కీ బాలమణి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీ రామ్ నాయక్, టీఎంకెఎంకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుపతి మధు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment