బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన యువకుడి ప్రమాదం
స్నేహితుడు స్వల్ప గాయాల గురికొంది
ట్రాక్టర్ ట్రాలీ ఢీకొన్న ఘటనపై సమాచారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రశ్న ఆయుధం నవంబర్ 04:
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి బాన్సువాడలో జరిగింది. బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన చాకలి రాము (30) అతడి స్నేహితుడు రవీందర్తో పాటు బాన్సువాడకు పాలు తీసుకుని బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నారు. దీంతో రాము అక్కడికక్కడే మృతి చెందగా రవీందర్ కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.