కామారెడ్డి పట్టణంలో తీరనున్న కరెంటు కష్టాలు 

కామారెడ్డి పట్టణంలో తీరనున్న కరెంటు కష్టాలు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

– 33/11 కేవీ సబ్ స్టేషన్ ను మంజూరు

– ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్

కామారెడ్డి పట్టణంలో నెలకొన్న కష్టాలను తీర్చేందుకు కామారెడ్డికి 33/11 కేవీ సబ్ స్టేషన్ ను మంజూరు చేయించడం జరిగిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ఉన్న సబ్ స్టేషన్ లపై లోడ్ ఎక్కువ పడటం, చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కామారెడ్డి సబ్ స్టేషన్ నుండి కరెంటు ఇవ్వడం ద్వారా కామారెడ్డి పట్టణానికి కరెంట్ సమస్యలు ఉత్పన్నము అవుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు నాదృష్టికి తీసుకువచ్చారన్నారు.

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తో సిఎండి ఆఫ్ ఎన్ పి డి సి ఎల్ వరంగల్ కర్నాటి వరుణ్ రెడ్డి తో మాట్లాడి కామారెడ్డి పట్టణానికి ప్రస్తుతమున్న సబ్ స్టేషన్లు కాకుండా నూతనంగా 33\11 కె.వి సబ్ స్టేషన్ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో మంజూరు చేయించడం జరిగిందన్నారు. దీనివలన కామారెడ్డి పట్టణానికి రాబోయే 25 సంవత్సరాల వరకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఇ సబ్ స్టేషన్ ఉపయోగ పడుతుంది అన్నారు. ఈ 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు.త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రెండు,.మూడు నెలల లోపు సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందన్నారు.

Join WhatsApp

Join Now