Site icon PRASHNA AYUDHAM

సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమిష్టి సహకారంతో పనిచేయాలి

కార్యక్రమాల
Headlines
  1. సంక్షేమ కార్యక్రమాలకు సమిష్టి కృషి అవసరం: జహీరాబాద్ ఎంపీ
  2. జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర సహకారం కోరుతాం
  3. దిశ సమావేశంలో వివిధ శాఖల ప్రణాళికల సమీక్ష
  4. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  5. ప్రథమ దిశ సమావేశం: ముఖ్య అభివృద్ధి ప్రణాళికలపై చర్చ

జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కర్

ప్రశ్న ఆయుధం, నవంబర్ 23, కామారెడ్డి :

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమిష్టి సహకారంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షేట్కర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.పి. మాట్లాడుతూ, 18వ లోకసభ ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి సారీగా దిశ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే దిశగా పనిచేయాలని అన్నారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. దిశ సమావేశంలో వ్యవసాయం, విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమం, పౌరసరఫరాలు, ఉద్యాన పట్టు పరిశ్రమ, గనులు భూగర్భ శాఖ, సిఎస్సి, పురపాలక, నీటి పారుదల,మార్కెటింగ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, ప్రణాళిక, పంచాయతీ, రోడ్లు భవనాలు, జాతీయ రహదారులు, గృహ నిర్మాణం, ప్రజారోగ్యం, మేప్మ, రెవిన్యూ, వైద్య ఆరోగ్యం శాఖలపై ఆయా శాఖాధికారులు వివరించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిది క్రింద 147670 మంది రైతులకు రూ. 531.6 కోట్లు జామచేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం క్రింద ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 9.68 కోట్ల రూపాయలు ఖర్చుచేసి జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం క్రింద ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 2535 పనులను 37.65 లక్షల పనిదినాలు గుర్తించి 73 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలిపారు. స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో 1,64,397 మంది లబ్ధి దారులకు వివిధ రకాల పింఛన్ల రూపేణా 36 కోట్ల 75 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన క్రింద నైపున్యాభివృద్ధి ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది తెలిపారు.ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన క్రింద జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 15 పనులను 61.25 కోట్ల అంచనాలతో చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలోని 1193 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 50957 మంది పిల్లలకు, 6689 మంది గర్భిణీలకు, 5645 మంది బాలింతలకు అనుబంధ పోషకాహారం అందించబడుతున్నాదని తెలిపారు. జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పురపాలక సంఘాల ద్వారా సచ్చ భారత్ మిషన్ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. ఆర్. ఆర్. ఆర్. క్రింద జిల్లాలో 65 పనులను 27.38 కోట్లతో పనులు చేపట్టి, ఇప్పటి వరకు 55 పనులు పూర్తిచేసి 16.63 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన పథకం క్రింద పనులు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. ఎంపి ల్యాడ్స్ గ్రాంట్ క్రింద ఇప్పటి వరకు 43 పనులు పూర్తిచేసి 59.37 లక్షలు ఖర్చుచేయడం జరిగిందని తెలిపారు. ప్రథమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకం క్రింద 11 పనులకు 49.50 లక్షలతో పనులు చేపట్టబడుచున్నవని తెలిపారు. రోడ్లు భవనాలు శాఖ ద్వారా పలు రోడ్ల పనులు చేపట్టడం జరుగుచున్నాయి. జిల్లాలో గల జాతీయ రహదారులపై రోడ్డు సేఫ్టీ క్రింద అండర్ బ్రిడ్జి , ఇంప్రూవ్మెంట్ పనులు చేపట్టబడుతున్నాయని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన క్రింద 1168 ఇళ్ల నిర్మాణాలకు గాను 1167 పూర్తయినవని తెలిపారు. పి. ఎం. స్వానిది క్రింద వీధి వ్యాపారులకు బ్యాంకుల నుండి ఋూణాలు అందించడం జరుగుచున్నది తెలిపారు. జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్, జననీ శిశు సురక్ష కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న గర్భిణీలకు ఉచిత రోగ నిర్దారణ పరీక్షలు, మందుల సరఫరా, ఉచిత కాన్పు, ఉచిత భోజనం, ఉచిత రవాణా కల్పించడం జరుగుతున్నదని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, 23 శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కే. వెంకట రమణా రెడ్డి, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, మున్సిపల్ చైర్పర్శన్లు ఇందుప్రియ, గంగాధర్, శ్రీకాంత్, దిశ కమిటీ సభ్యులు నర్షియ నాయక్ జాదవ్, దేశ్ముఖ్ రాజు, నరేష్, పి.కవిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version