Site icon PRASHNA AYUDHAM

ఏసీబీకి చిక్కిన సస్పెన్షన్ లో ఉన్న కంది సీసీఎస్ ఇన్స్ పెక్టర్

IMG 20240723 194444

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సస్పెన్షన్‌లో ఉన్న కంది సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట కిషోర్‌ ఏసీబీకి చిక్కాడు. ఓ కేసు విషయంలో స్థిరాస్తి వ్యాపారిని వెంకట కిషోర్‌ రూ.1.50 కోట్లు అడిగాడు. బాధితుడి నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుండగా.. అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో వెంకట కిషోర్‌కు స్థిరాస్తి వ్యాపారి రూ.10 లక్షలు ఇచ్చాడు. మళ్లీ డబ్బులు అడగడంతో స్థిరాస్తి వ్యాపారి ఏసీబీని ఆశ్రయించాడు.

Exit mobile version