కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) లో వైద్య శిబిరం

*కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం(కేజీబీవీ) లో వైద్య శిబిరం*

*జమ్మికుంట జూన్ 27 ప్రశ్న ఆయుధం*

వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కేశవపూర్ లోని కస్తూరిభా గాంధి బాలికల గురుకుల విద్యాలయంలో డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న 34 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యాలయంలోని బాలికలతో డాక్టర్ సంధ్యారాణి హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, రక్త హీనత వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గుణ్య, మెదడువాపు, టైఫా యిడు,జాండిస్ వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి క్లుప్తంగా బాలికలకు వివరించారు. చేతుల పరిశుభ్రత గురించి హ్యాండ్ వాష్ చేసే పద్ధతులు గురించి వివరించారు. బయటి తిను బండారాల జోలికి పోకుండా, మంచి పోషక పదార్తాలు తీసుకోవాలన్నారు. ఆకుకూరలు, పాలు, పండ్లు గ్రుడ్లు తీసుకున్నట్లయితే రక్త హీనత రాకుండా ఉంటుందని తెలిపారు ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేహించుకోవాలని బాలికలకు సూచించారు.

ఈ కార్యక్రమములో డాక్టర్ సంధ్యారాణి, హెల్త్ ఎడ్యుకేటరు మోహన్ రెడ్డి, సూపర్ వైజర్ అరుణ, విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ సుప్రియ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు సరళ,రమాదేవి ఆశా కార్యకర్త స్వప్న,ఉపాధ్యాయులు విద్యాలయ బాలికలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment