సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ సచివాలయంలో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రితో చర్చించారు. మంత్రి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ సచివాలయంలో మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్

Oplus_0