*ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకొని అరాచకాలు చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి*
*స్కీములు పెట్టి ప్రజాదరణ పొందుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ-స్కాంలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ*
*కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్*
*జమ్మికుంట జూన్ 18 ప్రశ్న ఆయుధం*
గెలిచిన 15 నెలల్లో కౌశిక్ రెడ్డి అనేక బెదిరింపులు అరాచకాలు అక్రమాలు చేసి హుజురాబాద్ పరువుతీస్తున్నాడనీ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్ర స్థాయిలో కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు బుధవారం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో గల శ్రీభక్తఆంజనేయ స్వామి 33వ వార్షికోత్సవానికి హాజరు కాక ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసాడు కాబట్టే కౌశిక్ రెడ్డి భయపడి ముందస్తు బెయిల్ కు పోయాడని,గతంలో సన్నిహితంగా ఉన్న గ్రానైట్ వ్యాపారి కుటుంబ సభ్యులు ఏకంగా ఎమ్మెల్యేపై కేసు పెట్టడం అంటే కౌశిక్ రెడ్డి ఏ విధంగా అరాచకం చేశాడో అర్ధం అవుతుందని ఎన్నికల్లో గెలిపించికపోతే చస్త అని సెంటిమెంట్ తో గెలిచి ఇప్పుడు కేసు కొట్టివేయమని కోర్టుకు ఎక్కారని,న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన కౌశిక్ రెడ్డికి బుద్ధిరావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.ఇలాంటివి ఇప్పటికైనా మానుకోవాలని పేర్కొన్నారు
*కౌశిక్ రెడ్డి పిచ్చి బీఆర్ఎస్ నాయకులకు పట్టింది*
బీఆర్ఎస్ నాయకురాలు కవిత చెప్పినట్లుగా పార్టీలో దయ్యాలు ఉన్నాయని ఆ దయ్యంలో కౌశిక్ రెడ్డి మొదటి వరసలో ఉంటారని,కౌశిక్ రెడ్డి పిచ్చి బీఆర్ఎస్ నాయకులకు పట్టిందనీ అందుకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.కేటిఆర్ ఇంతకుముందు కొంచెం పద్ధతిగా మాట్లాడేవారని ఇప్పుడు కౌశిక్ రెడ్డి వెనక ఉండడం వల్ల ఆ పిచ్చి కేటీఆర్ కు పట్టినట్లుందని సీఎం రేవంత్ రెడ్డి పై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమనీ హెచ్చరించారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని గడిచిన పదిహేను నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కాళేశ్వరం అవినీతి,ఫోన్ ట్యాపింగ్,కార్ రేసింగ్లో అవినీతి,గొర్ల స్కాంలాంటి అవినీతిలో కూరుకుపోయారని పేర్కొన్నారు
*దళారులను నమ్మకండి,అర్హులందరికీ దళిత బంధు అందజేస్తాం*
దళిత బంధు విషయంలో లబ్ధిదారులెవరు దళారులను నమ్మిమోసపోవద్దని,గతంలో ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకున్నారని ఓట్లు లేకపోయినా హుజురాబాద్ ప్రజల దళితుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి దళితబంధు నిధుల విడుదలకు కృషి చేశామని స్వచ్చంధంగా అధికారులకు మీ పత్రాలు సమర్పించి నిధులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేశినీ కోటి, సుంకరి రమేష్, పొనగంటి మల్లయ్య జమ్మికుంట మండల స్థాయి నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.