Site icon PRASHNA AYUDHAM

కౌశిక్ రెడ్డి నువ్వు రాజకీయ బ్రోకరివి…?

IMG 20250624 WA1667

*పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో కండ్లు తెరిచి చూడు ఎమ్మెల్యే కౌశిక్*

*బండి సంజయ్ కుమార్ పరిణితి చెందిన కార్యకర్త*

*బిజెపిని విమర్శిస్తే నీకు పుట్టగతులు ఉండవు*

*కౌశిక్ రెడ్డి నువ్వు రాజకీయ బ్రోకరివి*

*జమ్మికుంట జూన్ 24 ప్రశ్న ఆయుధం*

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఎంత అభివృద్ధి చేశాడో కండ్లు తెరిచి చూడాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ కోరారు బండి సంజయ్ పరిమితి చెందిన కార్యకర్త అని బండి సంజయ్ ని విమర్శించే పుట్టగతులు ఉండవని తెలిపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నీవు రాజకీయ బ్రోకర్ అని ప్రజలందరూ అంటున్నారని ప్రజలను ప్రజల మనసులు దోచుకునే నాయకుడిగా మెదులుకోవాలని ప్రతి గ్రామంలో నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కౌశిక్ రెడ్డిని దుయ్యబట్టారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రెండోసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికై (జూన్ 4) సరిగ్గా ఏడాది కాలం పూర్తయిందని రెండోసారి ఎంపీగా ఎన్నికైన తరువాత బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో చోటు దక్కిందని గత ఏడాది జూన్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ ఒకవైపు హోంశాఖలో తనకు అప్పగించిన పనుల్లో బిజీబిజీగా ఉంటూనే తనకు రాజకీయ జన్మనిచ్చి రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి ఏం చేశారనే అంశంపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొందని మంత్రిగా తనకు వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివ్రుద్ది కోసం వినియోగించడంలో బండి సంజయ్ కుమార్ చాలా మేరకు సక్సెస్ అయ్యారని పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం తొలిఏడాదిలోనే వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించగలిగారని చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు మరో రెండు వారాల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.2 వేల కోట్లకుపైగా నిధులను జాతీయ రహదారి విస్తరణ పనులకు ఖర్చు చేయనున్నారని అట్లాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి మండలానికి రూ.2 కోట్ల నిధులను ఖర్చు చేసి ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రోడ్లను నిర్మించారని సగటున ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల రూపాయలు అంతర్గత రోడ్లకు ఖర్చు చేశారని ఆధునీకరణ పనుల్లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివ్రుధ్ధి కోసం రూ.33 కోట్లకుపైగా ఖర్చు చేసి అద్బుతంగా తీర్చిదిద్దారని ఇటీవలే కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే.

వీటితోపాటు కరీంనగర్, ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణంలో జాప్యం జరుగుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర మంత్రి పలుమార్లు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై వాటిని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆగస్టు నాటికి ఉప్పల్ ఆర్వోబీ పనులు పూర్తి కాకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అట్లాగే కరీంనగర్ తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణంలో ఇబ్బందులను అధిగమించేందుకు రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి వాటిని అధిగమించేలా చేయడంతోపాటు పనులను వేగవంతం చేయించడంలో సఫలీక్రుతులయ్యారని అట్లాగే కరీంనగర్ నుండి తిరుపతి వెళ్లే రైలు గతంలో వారానికి ఒకసారి మాత్రమే వచ్చేది. దానిని రెండుసార్లు పొడిగించేలా చేసిన కేంద్ర మంత్రి ఇకపై వారానికి 4 సార్లు రైలు నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతోపాటు ఈ మేరకు రైల్వే శాఖ ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారని అతి త్వరలో దీనిపై సానుకూల నిర్ణయం రాబోతోందని

ఇవిగాకుండా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూళ్ల ఏర్పాటు కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా క్రుషి చేశారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బండి సంజయ్ వినతికి సానుకూలంగా స్పందించడంతోపాటు సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సుముఖత తెలిపారు. అతి త్వరలోనే అవి కార్యరూపం దాల్చబోతున్నాయని సిరిసిల్ల, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో నవోదయ స్కూళ్ల ఏర్పాటు చేయించడంలోనూ బండి సంజయ్ చూపిన చొరవ మరువలేనిదని పలుమార్లు సంబంధిత కేంద్ర మంత్రి, అధికారులను కలవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు తెప్పించి ఆయా స్కూళ్ల మంజూరు చేయించారని అతి త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో నవోదయ స్కూళ్లు ఏర్పాటు కాబోతున్నాయని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో టెక్నికల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినప్పటికీ అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనిపై అతి త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముందని దీంతోపాటు వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రసిద్ద ఆలయాలను టూరిజం సర్క్యూట్ గా మార్చాలని బండి సంజయ్ పలు ప్రతిపాదలను కేంద్రానికి పంపారు. అందులో భాగంగా సాక్సి (SACSI) పథకం కింద ఆయా ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివ్రుద్ధి చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని అతి త్వరలోనే దీనిపై విధాన నిర్ణయం వెలువడనుందని తెలిపారు

అట్లాగే శాతవాహన వర్శిటీ పరిధిలో లా కళాశాల మంజూరు చేయించడంలోనూ బండి సంజయ్ సక్సెస్ అయ్యారని సంబంధిత వర్శిటీ వీసీ, అధికారులు, మాజీ మేయర్ సునీల్ రావును వెంటబెట్టుకుని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కలిసి లా కాలేజీ మంజూరు చేయించారు. ఈ ఏడాది నుండి లాకాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభం కాబోతున్నాయని అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ పార్క్, స్పోర్ట్స్ రిక్రియేషన్ సౌకర్యాల కల్పించాలని బండి సంజయ్ చేసిన ప్రతిపాదనకు కేంద్ర క్రీడా శాఖ సుముకుత వ్యక్తం చేసిందని. అట్లాగే కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కోసం బండి సంజయ్ క్రుషి మరువలేనిదని ఎట్టి పరిస్థితుల్లోనూ కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిందేనంటూ గట్టి పట్టుదలతో ఉన్న బండి సంజయ్ ఇదే విషయంపై పలుమార్లు ఈ అంశాన్ని కేంద్ర మంత్రితోపాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల ద్రుష్టికి తీసుకెళ్లారని బండి సంజయ్ ఒత్తిడితో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర కార్మిక శాఖ సుముఖత వ్యక్తం చేసిందని అతి త్వరలోనే కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కానుందని బండి సంజయ్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసింది అని కరీంనగర్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న డంప్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపడంలోనూ బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరీంనగర్ కు రప్పించి ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇవ్వడంతోపాటు తగిన నిధులను కూడా మంజూరు చేయించేందుకు క్రుషి చేస్తున్నారని

ఇగ సీఎస్సార్ నిధులను రాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వివిధ అభివ్రుద్ధి, సేవా కార్యక్రమాలకు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈ ఏడాది రూ.5 కోట్ల నిధులను రాబట్టి వేములవాడ, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు. వీటి ద్వారా పేదలకు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని అట్లాగే ఈ ఏడాది 10వ తరగతి చదివే 6 వేల మంది బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లను అందించేందుకు సిద్ధమయ్యారని డ్రాపవుట్స్ తగ్గించడంతోపాటు 10వ తరగతి చదివే అమ్మాయిలు స్పెషల్ క్లాస్ లకు హాజరై ఆలస్యమైనా ఇంటికి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే ఈ సైకిళ్లను అందించనున్నారని అందుకోసం ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ప్రముఖ బ్రాండ్ కంపెనీ నుండి సైకిళ్లకు ఆర్డర్ ఇచ్చారు. అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే బాలికలందరికీ ఆయా సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఎంపీ కార్యాలయం వెల్లడించిందన8 ఇగ కేంద్ర మంత్రిగా బిజీబిజీగా గడుపుతున్నప్పటికీ తనకు ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వారానికి రెండు, మూడు రోజులు కరీంనగర్ కు విచ్చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి క్రుషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ , జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు , మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్ , భూత అధ్యక్షుడు దొగుల రవి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version