పుష్ప 2 సినిమా లో అమానుష , సంఘటనలు తీవ్రంగా ఖండించిన కవి,సినీ గాయకుడు మద్దెల శివకుమార్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 11 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
మానవతా విలువలను మంటగలిపి,వ్యాపారాత్మక విలువలతో అంటగాగుతున్న పుష్ప 2 సినీ హీరో అల్లుఅర్జున్ ను, నిర్మాతల వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టిన కవి సినీ గాయకుడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తీవ్రంగా ఖండించారు.
ఘనత వహించిన అల్లు అర్జున్ అహంకార పూరిత ,అనాలోచిత , ఆకస్మిక వీర ప్రదర్శన వలన , తొక్కిసలాటలో మరణించిన రేవతి మృతికి మరియు వారి అబ్బాయి జీవన్మరణ సంగ్రామానికి కారణమైన అల్లు అర్జున్ ను వెంటనే అరెస్టు చేయాలి అన్నారు.
ఆ విషాద కుటుంబానికి ముష్టి వేసినారు తప్ప న్యాయం చేయాలేదు అన్నారు.
అడవులను కొల్లగొట్టే ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో,డాన్ దాదాగిరిని, రౌడీయిజాన్ని హింసను ప్రేరేపించేటట్లుగా ఉన్న అల్లు అర్జున్ హీరో గిరికి ,ఒక మహిళ మృతికి, ఆ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి కారణమై, పెట్రేగిన అల్లు అర్జున్ హీరోఇజాని కి, అతనికి ముట్ట చెప్పిన జాతీయ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలి పుష్ప 2 సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి డిమాండ్ చేశారు.
పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు విపరీతంగా పెంచడం,
సామాన్య, మధ్యతరగతి ,పేద కుటుంబాల ప్రేక్షకులను ఘరానా దోపిడీ చేయడమే అన్నారు.
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్!
తమ పబ్బం గడుపుకోవడానికి కోటానుకోట్ల రూపాయలు సంపాదించడానికి, మానవత్వం మంటగలిపి దుర్మార్గంగా టికెట్ల రేట్లు పెంచుతున్న సినీ నిర్మాతల మరియు హీరోల యొక్క
వ్యాపారాత్మక నీచ వైఖరి , సామాన్య ప్రేక్షకులకు సినిమా అందుబాటులో లేకుండా చేయడమే కాకుండా, సామాన్య ప్రేక్షకులను అభిమానులను నిలువు దోపిడీ చేయడమే అని, ఇది ఘరానా పెద్దమనుషుల దోపిడీ అని, దీనిని ప్రజాస్వామిక వాదులు అభ్యుదయవాదులు సమాజ సేవకులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని,
దీనికి వత్తాసు పలుకుతూ, తమ ప్రభుత్వ ప్రయోజనాల కోసం, పరుగు పరుగున ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా
ఈ దోపిడీలో భాగస్వాములని, దోషులేనని,
ఇకముందు ఇటువంటివి జరగకుండా ప్రజల కొరకు పని చేస్తున్నామని చెప్పుకునే ప్రజా ప్రభుత్వాలు
కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ,
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన అమానుష అవాంఛనీయ సంఘటన కళ్ళు తెరిచి
భవిష్యత్తులో టికెట్ల రేట్లు పెంచకుండా, మిడ్ నైట్ షోలను బెనిఫిట్ షో లను రద్దు చేసే విధంగా ప్రభుత్వాలు జీవోలు తయారుచేసి ఉత్తర్వులను ఇవ్వాలని, లేకుంటే ప్రజల నుండి వచ్చే తిరుగుబాటును ఉవ్వెత్తున ఉద్యమాల రూపంలో చవిచూడాల్సి వస్తుందని, దానికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని
అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ డిమాండ్ చేశారు.కలత చెందిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కన్నీరు
వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ , అభిమానులే తమకు ప్రత్యక్ష దైవాలని, అభిమానుల తోటే తమ నటన జీవితం ముడిపడి ఉన్నదని, వేదికల మీద ఊక దంపుడు మాటలతో ,మొసలి కన్నీరు కారుస్తూ , అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటూ కోటానుకోట్ల రూపాయలు సంపాదిస్తూ, పిల్లికి బిచ్చం పెట్టకుండా పక్కవాడికి ఏ మాత్రం సాయం చేయకుండా, స్టార్ డంను వెలగబెడుతూ స్టార్డంతో విర్రవీగుతూ , తమకు ప్రత్యక్ష దైవాలని చెప్పబడే అభిమానుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతుంటారు అల్లు అర్జున్ లాంటి హీరోలు. అంతేగాక తన అభిమానులు తనకు ఆర్మీ అని ప్రత్యేకంగా చెబుతాడు . మరి అటువంటి అభిమానుల కొరకు ఫ్రీగా ఒక రోజంతా బెనిఫిట్ ప్రత్యక్ష దైవాలనే అభిమా తొక్కిసలాటల మొదలైనాక వేరే గేటు ద్వారా లోనికి వెళ్లి కొద్దిసేపు సినిమా చూసి అత్యవసర సమావేశంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తో పాటు, సంఘ ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్, సంఘ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ జిఎం అందెల ఆనందరావు, సంఘ ఉపాధ్యక్షులు, సినీ నటులు, చిత్రపురి వెల్ఫేర్ సొసైటీ(ఎల్ఐజి & ఈ డబ్ల్యూ ఎస్) సంయుక్త కార్యదర్శి తాండూర్ ధనరాజ్, సినీ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ సెక్రెటరీ రామన్న,
సినీ గాయకులు స్వర సంగీత విద్వాన్ కలవల రాందాస్,సినీ నిర్మాత ఆళ్ల రాఘవ, వర్ధమాన సినీ దర్శకులు సుభాకర్, సినీ నటులు శ్రీపాద సత్యనారాయణ పీక కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now