ఖబర్దార్ గోరంట్ల మాధవ్: కళ్యాణదుర్గం సీనియర్ టీడీపి నేతలు..
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పతకాలపై నోరు పారేసుకున్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖబడ్దార్ జాగ్రత్త అంటూ కళ్యాణదుర్గం టీడీపీ సీనియర్ నాయకులు హెచ్చరించారు.
ప్రజా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ నీ పార్టీకి కానీ లేదు అని అన్నారు.
మంగళవారం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదిక వద్ద టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురుంచి అనుచిత వాక్యాలను కండిస్తూ టీడీపీ సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున, మండల కన్వీనర్ కురుబ శివన్న, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ డీకే రామాంజినేయులు, గాజుల శ్రీరాములు, కామక్కపల్లి నాగరాజు, షామీర్, మల్లిపల్లి నారాయణ, టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు.. గత నలబై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి అనుచితంగా మాట్లాడటం వైసీపీ నాయకులకు చెల్లుతుందని, వారి అధ్యక్షుడే ఎవరైతే బూతులు మాట్లాడుతారో అలాంటి వారికి పదవులు ఇచ్చి పక్కన పెట్టుకున్నారని ఇలాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అంటూ ఘాటుగా హెచ్చరించారు.నువ్వు మా అధినేత, ముఖ్యమంత్రి చంద్రాబునాయుడు ని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు అదే విధంగా అలానే నువ్వు మాట్లాడితే నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను తరిమి తరిమి కొడతాం అంటూ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కురుబ సంఘ నాయకులు తదితర పాల్గొన్నారు.