గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి
– రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి,
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లో ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఒక ప్రకటన తెలిపారు.
జిల్లాలో ఈ క్రింద పేర్కొనబడిన ప్రైవేటు పాఠశాలలకు అనుమతి లేదని అయినప్పటికీ ఆ పాఠశాలల యజమాన్యాలు అడ్మిషన్స్ కొరకు ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలు రావటం వలన సంబంధిత మండల విద్యాశాఖాధికారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే ఈ పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్ లో గల నారాయణ స్కూల్, అశోక్ నగర్ కాలనీలోని విఐపి యూనివర్సల్ స్కూల్, పంచముఖి హనుమాన్ కాలనీలో గల ప్రెసిడెన్సియల్ స్కూల్, దేవి విహార్ ఫేస్ టు లో గల ఆరంభ స్కూల్, అశోక్ నగర్ కాలనీలోని శ్లోక రెండవ బ్రాంచ్ స్కూల్, విద్యానగర్ కాలనీలో గల ఛాంపియన్స్ రోజువుడు స్కూల్, విద్యానగర్ కాలనీలోని వివేకానంద బీట్ ఆఫర్స్ తదితర పాఠశాలలకు ప్రభుత్వ అనుమతి లేదని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయా పాఠశాలలో చేర్పించే ముందు పూర్తి సమాచారాన్ని మండల విద్యాధికారిని సంప్రదించకుండా ఇష్టానుసారంగా గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలో చేర్పించినట్లైతే తరువాత జరిగే పరిణామాలకు తల్లితండ్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.