సదాశివపేటలో శ్రీ మహంకాళి బోనాల మహోత్సవంలో పాల్గొన్న పులిమామిడి రాజు
Donthi Mahesh
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రీ మహంకాళీ మాతకు ఉదయాన్నే కాంగ్రెస్ నాయకులు పులిమామిడి మమత, రాజు దంపతుల తరపున ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించి, ఓడి బియ్యాన్ని సమర్పించారు. మహంకాళీ మాతకు ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం పులిమామిడి రాజు దంపతులు 2.5 తులాల (లక్ష తొంబై వేల విలువగల) బంగారు ఆభరణాన్ని అమ్మవారికి సమర్పించారు. తదుపరి బోనాల ఊరేగింపు కార్యక్రమం ఆలయ ప్రాంగణం నుండి దుర్గాభవాని మందిరం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పులిమామిడి రాజు హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో అమ్మవారి వేషధారణలు, చిన్నారుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి. అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ..సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, చక్కని పాడి పంటలతో తులతూగెట్టాటూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నల్ల సుధాకర్, చాపల హనుమంతు, శంకర్, బంటు రవి, చాపల రవి, చిన్న, మనోహర్, రాజు, సాయి కిరణ్, అఖిల్, మనోజ్, వినోద్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
To provide the best experiences, we use technologies like cookies to store and/or access device information. Consenting to these technologies will allow us to process data such as browsing behavior or unique IDs on this site. Not consenting or withdrawing consent, may adversely affect certain features and functions.