*వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన రాజు రజక..*
*ప్రశ్న ఆయుధం, జూన్ 24, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
మంగళవారం రోజున వైద్య ఆరోగ్య, సైన్స్ టెక్నాలజీ శాఖల మంత్రిదామోదర రాజనర్సింహ ను వారి నివాసం లోని ఆయన కార్యాలయంలో కలిసిన రాజు రజక పేద విద్యార్థిని హరిత ఆర్థిక విషయ పరిస్థితిని మంత్రి దామోదర రాజనర్సింహ ద్రుష్టి కి తీసుకురాగా మంత్రి స్పందించి పేద విద్యార్థిని విద్యార్థుల కు విద్యాపరంగా కావలసిన సహాయ సహకారాలు పూర్తిగా ప్రభుత్వం తరపున అందిస్తామని సంగారెడ్డి జిల్లా కి చెందిన విద్యార్థిని హరిత కు హమీ ఇచ్చారు. విద్యారంగంలోబాలికలు ర్యాంకు లలో ముందంజ లో ఉండేలా పట్టుదలతో చదవాలని ఆయన తెలిపారు. ప్రతిభా పాటవాలు ఉన్నా పేద విద్యార్థిని విద్యార్థుల కు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.