కీసర బీజేపీ నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్‌కు ఘన స్వాగతం, చేరికలు

*కీసర బీజేపీ నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్‌కు ఘన స్వాగతం, చేరికలు*

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం మే 10

IMG 20250510 WA2693

జనతా పార్టీ (బీజేపీ) కీసర మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కోల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ సూచన మేరకు, పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి సమక్షంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్‌ను కీసర మండల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కలిసి మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ సమక్షంలో చేర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్, బండారి నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయి కుమార్ గౌడ్ సహా పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈటెల రాజేందర్ వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కీసర మండలంలోని అన్ని గ్రామాల నుంచి సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈటెల రాజేందర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వారందరికీ కోల బాలరాజు యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment