*కీసర బీజేపీ నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం, చేరికలు*
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం మే 10
ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ సమక్షంలో చేర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్, బండారి నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయి కుమార్ గౌడ్ సహా పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈటెల రాజేందర్ వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కీసర మండలంలోని అన్ని గ్రామాల నుంచి సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈటెల రాజేందర్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన వారందరికీ కోల బాలరాజు యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.