కోదండరాం ఎమ్మెల్సీ నియామకం పట్ల హర్షం
ముఖ్య మంత్రి కి కృతజ్ఞతలు
కోదండరామ్ కు మంత్రి పదవి ఇవ్వాలి
జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ టి.జే.ఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా నియమించినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వం పది సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా గౌరవించకుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగినది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నందుకు కోదండరాం ను ఎమ్మెల్సీగా నియమించడం పట్ల తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది.కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సలహాదారు షబ్బీర్ అలీ మండలి ఎమ్మెల్యేలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్,టీజేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పూల్ సింగ్ రాథోడ్,నరేష్,యోగేష్,ప్రవీణ్,కిషోర్,రాజు,నర్సింలు,రాజేందర్,రవి,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..