Site icon PRASHNA AYUDHAM

ప్రతి కుటుంబానికి ఇంటి కలను నెరవేర్చే దిశగా కృషి: ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

IMG 20250620 205022

Oplus_0

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి కుటుంబానికి ఇంటి కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నామని ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించనున్న గృహాల కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేద వర్గాలకు నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. పథకం అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి కలను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. గృహ నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని, పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామస్థులు కూడా తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ సురేష్, పంచాయతీ సెక్రటరీ సంతోషి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు విజయ్ కుమార్, ఆగం రాజు, స్వప్న, నీరుడి నర్సింలు, నాయకులు హన్మంత్ రెడ్డి, ప్రభు, వెంకటేష్, సూరారం మహేష్, నీరుడి మల్లేష్, ఆగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version