Site icon PRASHNA AYUDHAM

ఎల్లారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళులు

IMG 20250921 WA0106

ఎల్లారెడ్డి, సెప్టెంబర్21, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి పట్టణంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ కర్త, ప్రజాసేవకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా స్మారక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్య రవికుమార్ నేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు పద్మ పండరి నేత, డివిజన్ అధ్యక్షులు దేవసాని పోశెట్టి నేత, పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మ కాశీరాం నేత, కోశాధికారి గూడ రామకృష్ణ నేత, ఉపాధ్యక్షులు నాగుల నర్సింలు నేత, జాయింట్ సెక్రటరీ పద్మ బాలకిషన్ నేత, గుజ్జరి లక్ష్మీనారాయణ నేత, సెక్రటరీ తాటిశెట్టి శ్రీనివాస్ నేత, ముఖ్య సలహాదారులు నాగుల యాదగిరి నేత, డైరెక్టర్ చిన్న శ్రీనివాస్ నేతతో పాటు పాండి పెద్దమనుషులు షేర్ల రాజశేఖర్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు, సభ్యులు బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆలోచనలు, సేవలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయని, కొత్త తరాలకు మార్గదర్శకంగా ఉంటాయని వారు గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా సామాజిక న్యాయపరుడిగా గుర్తింపు పొందారు.

“పదవులు కాదు, ప్రజాసేవే నా లక్ష్యం. ప్రజల సంక్షేమం కోసం త్యాగం చేయడం నా జీవిత ధ్యేయం.” అని చెప్పిన ఆయన పద్మశాలి సమాజ అభ్యున్నతికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో అగ్రగామి పాత్ర పోషించి, సమానత్వం, విద్య, సామాజిక సమగ్రతపై ఎల్లప్పుడూ నిబద్ధతతో నిలిచారు. ఆయన జీవితం, త్యాగం కొత్త తరాలకు మార్గదర్శకం కావాలని సభలో మాట్లాడిన నేతలు పేర్కొన్నారు.

Exit mobile version