మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో కొండకల్ శంకర్ గౌడ్ 56వ జయంతి వేడుకలు
ప్రశ్న ఆయుధం మే09: శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి మసీద్ బండ, తెలంగాణ సాధనకోసం ప్రాణాలర్పించిన మన రాజకీయ గురువు, తెలంగాణ యోధుడు కొండకల్ శంకర్ గౌడ్ 56వ జయంతి సందర్భంగా ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా స్మారక కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనాలు అర్పించారు. జీహెచ్ఎంసి కార్మికులకు పండ్లు పంపిణీ చేసి గౌరవించారు తెలంగాణ సాధనలో శంకర్ గౌడ్ త్యాగాలను స్మరించుకున్నారు. మారబోయిన రవి యాదవ్ మాట్లాడుతూ శంకర్ గౌడ్ తెలంగాణ కోసం చేసిన త్యాగాలు మన తరాల వారికి ప్రేరణ శేరిలింగంపల్లి అభివృద్ధికి అతను చేసిన కృషిని మరువలేము. ఈ రోజు మన కర్తవ్యం అతని స్వప్నాలను నిజం చేయడమే. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే ఎన్ రాములు, కొండగల్ శ్రీనివాస్ గౌడ్, గంగాధర్ గౌడ్, డాక్టర్ రవికుమార్, స్వామినాథ్, ప్రభాకర్ గౌడ్, గడ్డం శ్రీనివాస్, శ్రీకాంత్ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.