Site icon PRASHNA AYUDHAM

ప్రభుత్వ భూములను కాపాడాలి: తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్

భూములను

Oplus_131072

Headline :
ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేసిన కొండాపురం జగన్

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలో రాంచందర్ రెడ్డి నగర్ కాలనీలో 403 సర్వే నంబర్లు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి రాష్ట్ర నాయకుడు కొండాపురం జగన్ అన్నారు. శనివారం కొండాపురం జగన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలో రాంచందర్ రెడ్డి నగర్ కాలనీలో 403 సర్వే నంబర్లు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిసి క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బస్తి వాసులతో కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బస్తి వాసులు ఉన్నారు.

Exit mobile version