Headlines in Telugu
-
ఎర్రగుంట సమస్యలపై కూనంనేని సమీక్ష: తక్షణ పరిష్కారాలు
-
చెరువు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కూనంనేని హామీ
-
ఎర్రగుంట అభివృద్ధి: బైపాస్ రోడ్డు పూర్తికి MLA ప్రకటన
-
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల అభివృద్ధి పై MLA కూనంనేని దృష్టి
-
ప్రజల సమస్యల పరిష్కారానికి కూనంనేని నడుం బిగించారు
*👉ప్రజల విజ్ఞప్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
*👉ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పిస్తాం.*
*👉చెరువు సమస్యకు పరిస్కారం చూపెడతా.*
*👉బైపాస్ రోడ్డు పూర్తయితే ఎర్రగుంటకి మహర్దశ.
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
పాల్వంచ ప్రజల విజ్ఞప్తులను తక్షణమే పరిష్కరించాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటను ఎమ్మెల్యే కూనంనేని వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల త్రాగు నీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరితగతిన ఆవిష్కృత సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎర్రకుంట చెరువు సమస్యకు త్వరలోనే పరిస్కారం చూపెడతానీ, అధికారులు సమగ్ర సమాచారం అందించాలని ఆదేశించారు. బైపాస్ రోడ్డు పూర్తయితే ఎర్రగుంటకి మహర్దశ పడుతుందిని, త్వరలోనే పనులు పూర్తి అవుతాయిని తెలిపారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ తరహాలో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను మహానగరాలుగా తీర్చిదిద్దెదుకు, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని నిలిపేందుకు కృషి జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిగడపకు చేర్చడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిస్కారం చూపేందుకు అడుగులు వేస్తున్నామని, నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, బస్తీల్లో పక్క రహదారులు, డ్రైనేజి నిర్మాణాలపై ప్రత్యేక ద్రుష్టి సారించినట్లు తెలిపారు. వివిధ పథకాలు, గ్రాంట్ల ద్వారా ఇప్పటికే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మరికొన్ని పనులకు సంబంధించి నిధుల మంజూరికోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. *ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వివేక్, మున్సిపల్ కమిషనర్ కె సుజాత, మున్సిపల్ DE, R&B EE వెంకటేశ్వరావు, DE నాగేశ్వరరావు, ఇరిగేషన్ DE రాణి, మిషన్ భగీరథ DE, విద్యుత్ శాఖ AE, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, నాయకులు వై వెంకట్రామయ్య, మన్నెం వెంకన్న, బొమ్మెన సత్యనారయణ, ఆదినారాయణ, sk లాల్ పాషా, ప్రసాద్, శంకర్, కుమార్ స్థానిక ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.