ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు

ప్రజా
Headlines in Telugu
  1. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం
  2. కోరుట్లలో అన్ని వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
  3. డిసెంబర్ 1 నుండి 9 వరకు శుభ్రతా ప్రణాళికలు: మున్సిపల్ కమిషనర్
  4. డ్రైనేజీ మరియు కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి
  5. పారిశుద్ధ్య కార్మికుల సమిష్టి కృషితో శుభ్రతా మిషన్

ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా డిసెంబర్ 01 నుండి 09 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు కోరుట్లలోని అన్ని వార్డులలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి మాట్లాడుతూ డిసెంబర్ ఒకటి నుండి తొమ్మిది వరకు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రతి వార్డులో మెయిన్ డ్రైనేజీలు, వార్డులలో ఉన్న మురికి కాలువలు తీయించి ట్రాక్టర్ ద్వారా లిఫ్ట్ చేయించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now