* ‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..!!_*
*_అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కృష్ణయ్య_*
హైదరాబాద్, జూన్ 27 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.
రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్ర సర్కారు బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రె్సను డిమాండ్ చేశారు.