కృష్ణవేణి ఇటుక బట్టి ని తొలగించాలని డిఎస్పి కి ఫిర్యాదు
ఇటుక బట్టీని వెంటనే తొలగించాలి సోమేశ్వర్ గ్రామస్తుల ఆరోపణ
ప్రశ్న ఆయుధం 10 మే (బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామ శివారులో బీర్కూర్ ప్రధాన రోడ్డు పక్కన గల కృష్ణవేణి ఇటుక బట్టిని తొలగించాలని బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి కి సోమేశ్వర్ గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.ఇటుక బట్టి ఉండటం వలన ఇటుకను తయారు చేయుటకు పొట్టును బొగ్గును వాడుతారు దీంతో ప్రయాణికులకు కళ్ళల్లో దుమ్ము ధూళి పడడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.పక్కనే హనుమాన్ ఆలయం కలదు గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది కల్గుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు.ఈ ఇటుక బట్టీని వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.