మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్, హరీశ్ రావు మాత్రం కాంగ్రెస్పై విషం చిమ్ముతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ మంచి పని చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్, ఆ పార్టీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వారిపై నిప్పులు చెరిగారు.
కేటీఆర్.. నీ సంస్కారం ఇదేనా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేస్తుంటే కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. వీరిద్దరూ అధికారం పోయిన ఫ్రస్టేషన్లో ఉన్నట్లు అర్థం అవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారని, అపరిచితుడు సినిమాలో ఉండే శిక్షలన్నీ కేసీఆర్ కుటుంబానికి వేయాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలపై రికార్డింగ్ డ్యాన్సులు అంటూ..