*కాంగ్రెస్ రైతు భరోసా మోసంపైన కేటీఆర్ ప్రెస్ మీట్ పాయింట్స్*
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయింది.
రాజ్యంగం అమలులోకి వచ్చిన 75 ఎండ్ల సంబరాల సందర్భంగా..దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ… ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటు సవాలక్ష కండీషన్లు పెట్టి… జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నది రేవంత్ ప్రభుత్వం
ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే
తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరు.
నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారు.
మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు..
కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతది..
కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్/రేవంత్ అని రైతాంగానికి అర్థమైపోయింది..
తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడు
డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని
రాహుల్ గాంధీ అన్నారు
రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది…ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా…
ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా… కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి
కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి
రైతు రుణమాఫీ,రైతు బంధుకు లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారు
కేసీఆర్ రైతుబందుగా నిలిచారు…రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు
రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా
ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 3 కు ముందు తీసుకుంటే 10 వేలు, తరువాత 15 వేలు అన్న కాంగ్రెస్ నేతల మాటలు ఎక్కడ పోయాయి
గతంలో ఇచ్చిన పదివేలనే బిచ్చం అన్న రేవంత్.. మరి నువ్వు పెంచిన వెయ్యి రూపాయలు ఏంటి.. ముష్టి వేస్తున్నావా..
ఓడ దాటే దాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న.. ఇదే కాంగ్రెస్ తీరు…
రేవంత్ నుంచి రాహుల్ దాకా రైతులకు చెప్పిందేంటి.. చేసిందేంటి..
ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలె..
రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలె..
నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలె.
మ్యానిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలి.
కాంగ్రెస్ నాయకులు రైతుభరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారు
సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారు
దేశంలో అత్యధిక జీతాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారు
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పిఆర్సీ,డీఏ ఇచ్చింది బిఆర్ఎస్ కాదా
ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిగజారింది అని రేవంత్ మాట్లాడడం వారిని అవమానపరచడమే
కాలేశ్వరం, మిషన్ భగీరథ వంటి అనేక గొప్ప కార్యక్రమాలను ఎంతో కృషితో పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులపైన రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారు…
రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు
ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం కాదు కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ రెడ్డినే… మూర్ఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది
రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్ గా ఉన్న హైదరాబాదులో హైడ్రా,మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయింది
సంవత్సరంలో లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు… కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారు
పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా… దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు దివాళా తీసింది రేవంత్ రెడ్డి మెదడు
5,943కోట్ల రెవిన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించాము… రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారు
రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలి…. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి
రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు,మండల కేంద్రాలు,నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు తెలుపుతాము
హార్టికల్చర్ రైతులకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనే దానిపై క్లారిటీ లేదు
ఉద్యోగులకు భూమితో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో గండం దాటేందుకు రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
రైతు బంధు పధకం ఉండాలా వద్దా అనేది రైతులు నిర్ణయం తీసుకోవాలి
గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోండి