నాంపల్లి ఈడి కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన కూకట్పల్లి కాంగ్రెస్ నేతలు
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 17: కూకట్పల్లి ప్రతినిధి
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ చార్జీషీట్లో చేర్చిన ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో కూకట్ పల్లి నియోజకవర్గం వై జంక్షన్ వద్ద మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా సమీకరమయ్యారు. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై, ఈడీ ఆఫీసు ముట్టడికి కార్యకర్తలకు నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీబీఐ, ఈడీలను బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించేందుకు ఉపయోగిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు బీజేపీ అవి జేబు సంస్థలుగా మారుస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కూకట్పల్లి నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు “ఈడీ డౌన్ డౌన్”, “మోడీ డౌన్ డౌన్”, “అమిత్ షా డౌన్ డౌన్” నినాదాలు చేస్తూ నాంపల్లి ఈడీ కార్యాలయంపై ముట్టడికి బయలుదేరారు.
ఈ నిరసనలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, కాంగ్రెస్ సీనియర్ నేతలు సాదు ప్రతాపరెడ్డి, మేకల మైఖేల్, మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, రేష్మ నాయుడు, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణ రాజ్ పుత్, మొయినుద్దీన్, మేకల రమేష్, మగ్దుం భాయ్, నితీష్ గౌడ్, శివ చౌదరి, ఎ ఎమ్ సి వైస్ చైర్మన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.