ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఓకే వేదికపై కూకట్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

ప్రజా
Headlines :
  1. కూకట్‌పల్లిలో కాంగ్రెస్ విజయోత్సవ సభ – గ్రేటర్ హైదరాబాద్ గెలుపుకు పిలుపు
  2. మూసి ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్-బీజేపీపై విమర్శలు
  3. 6 గ్యారెంటీల అమలుతో పేదల జీవితాల్లో వెలుగు – కాంగ్రెస్ నేతలు
  4. హరివర్ధన్ రెడ్డి: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి
  5. రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి: కాల్వ సుజాత

ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఓకే వేదికపై కూకట్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 07: కూకట్‌పల్లి ప్రతినిధి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అన్నారు.

ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ కమిటీ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి సాధు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆసియాలో అతిపెద్ద కాలనీగా పేరుందిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో టెంపుల్ బస్ స్టాప్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయోత్సవ సభా కార్యక్రమానికి హరివర్ధన్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత.. కూకట్పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీ ల హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అయితే గత ప్రభుత్వం కేసీఆర్ హయంలో ఆర్థిక విధ్వంసం చేసిందన్నారు. ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుంటే భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీలు ఏకమై అడ్డుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రెండు లక్షల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షించింది అన్నారు. బిజెపి బీఆర్ఎస్ ఒక్కటేనని చీకట్లో ఒప్పందాల కుదుర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సర్వతో ముఖాభివృద్ధికి కృషిలో భాగంగా మూసి ప్రక్షాళనతో హైదరాబాద్ నగర ఖ్యాతిని పెంచడంతోపాటుకార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపడితే బిజెపి బీఆర్ఎస్ లు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన మూసి అభివృద్ధి ప్రక్షాళన ఆగదని అన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసి రాష్ట్రంలో ఉన్న నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపుతారని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మ్రోగిస్తుందన్నారు. ప్రజలు ప్రతిపక్షాల దురుద్దేశ పూరిత విమర్శలకు ఆకర్షితులై వారి మాటలు నమ్మితే నష్టపోతారన్నారు.

 పల్లి నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కృషి చేస్తుందన్నారు. కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఇప్పటికే మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణంతోపాటు పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణా రాజ్ పుత్, ఫణీంద్ర కుమార్, సంజీవరావు, మేకల మైకల్, పొడుగు అప్పారావు, సంధ్య, రేష్మ, జోజమ్మ, 114 డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంగస్వామి, శివ చౌదరి, కొప్పిశెట్టి దినేష్, గంధం రాజు, బుచ్చి మల్లి, బాల్నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోను, శ్రీధర్ చారి, రాజు ముదిరాజ్, గిరి నాయుడు, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now