భారత్ దుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..
కామారెడ్డి ఆర్సీ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 11:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ రోడ్ లోగల భారత్ దుర్గా సేవా సమితి (బి.డీ.ఏస్.ఏస్.) దుర్గా మాత వద్ద ఉదయం కుంకుమార్చన పూజా కార్యక్రమం ఆనంతరం మద్యహ్నం అమ్మవారి సన్నిధిలో మహా అన్నప్రసాద కార్యక్రమం జరిగింది.
ఇట్టి కుంకుమార్చన పూజ అన్నప్రసాద కార్యక్రమాలకు 46.47.వ వార్డుల మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు అయినారు
ఈ కార్యక్రమంలో బి.డి.ఎస్.ఎస్. ప్రతినిధులు గెరిగంటి లక్ష్మినారాయణ, తాటిపల్లి సునీల్, చెన్నం స్వామి, బట్టు భాస్కర్, బోడ్డు హీతీష్, సాయి ఈశ్వర్, గెరిగంటి నిఖిల్, మరియు భారత్ దుర్గా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.