Site icon PRASHNA AYUDHAM

పిడుగు పడి సింగరేణి కాంటాక్ట్ కార్మికుడు కుంజా జగన మృతి

IMG 20250614 WA0322

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 14 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
పిడుగుపాటుకు గురైన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికునీ కుటుంబాన్ని అన్ని విధాలు ప్రభుత్వం ఆదుకోవాలని ఐ ఎఫ్ టి యు నాయకుల సంతాపం తెలియజేశారు.
శనివారం సాయంత్రం రేగుల గండి సమీపంలో పిడుగు పడి చనిపోయిన సింగరేణి కాంటాక్ట్ కార్మికుడు రేగుల గండి నివాసి మూలవాసి కుంజా జగన్ (40) మృతి పట్ల ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నాసర్ పాషా,అంగోత్ మంగీలాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూనవరం అడ్డాలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న జగన్ శనివారం నాడు విధులు ముగించుకుని తన వ్యవసాయ భూమిలోకి వెళ్తున్న సమయంలో సాయంత్రం సమయంలో పిడుగు పడి చనిపోవడం అత్యంత బాధాకర సంఘటనగా వారు అభివర్ణించారు.ఆయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారని జగన్ మృతితో వాళ్ళందరూ దిక్కులేని వారయ్యారని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జగన్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్ల నాగేశ్వరరావు,నల్లా రమేష్,బత్తుల లక్ష్మణ్ , రాంబాబు వెంకన్న, ఆదిలక్ష్మి, రుక్మిణి,అనసూర్య, వెంకటలక్ష్మి ,కంది లక్ష్మి ,కొమరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version