కేపీఎల్ క్రికెట్ టోర్నీ విజేత కురుపాం కింగ్స్

*కేపీఎల్ క్రికెట్ టోర్నీ విజేత కురుపాం కింగ్స్*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 17( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు

కురుపాం సాయిబాబా గుడి ఏదురుగా ఉన్న గ్రౌండ్ వద్ద కురుపాం ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్స్ దొనక నవీన్, పెద్దింటి ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో గత నెల రోజులగా జరుగిన క్రికెట్ టోర్నమెంట్.

గురువారం జరిగిన ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ ల్లో కొండవాడ టీమ్ పై కురుపాం కింగ్స్ విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన కొండవాడ టీం 16 ఓవర్లకు 10 వికెట్లు నష్టానికి 110 పరుగులు సాధించింది

విరామం అనంతరం బ్యాటింగ్ కి దిగిన కురుపాం కింగ్స్ టీం నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే 111 రన్స్ చేసి కొండవాడ జట్టుపై విజయం సాధించింది.

విన్నర్స్ కు ప్రైజ్ మనీ 40,000 తో పాటు ట్రోఫీని అందజేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరి

చర్ల వీరేష్ చంద్ర దేవ్,

రన్నర్స్ గా నిలిచిన కొండవాడ జట్టుకు 20000 రూపాయల ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీతో ని అందజేసిన మాజీ జెడ్పిటిసి అందవరపు కోటేశ్వరరావు.

థర్డ్ ప్రైస్ లిక్కిడి టీంకు వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు 10000 రూపాయలతో పాటు ట్రోఫీని అందజేసారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆదిల్,శెట్టి నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ జి.రమణమూర్తి, వంశి, రమేష్ సుకేష్ చంద్ర పండా, త్రిపుర, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now