*మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన కురుపాం ఎమ్మెల్యే*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 19 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురంలో సోమవారం నాడు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ & కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* ప్రారంభించారు. వేసవి దృశ్య ఈ మజ్జిగ చలివేంద్రం ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, బిజెపి మండల కన్వీనర్ పెద్దింటి దివాకర్, నాయకులు వెంపటాపు భారతి, భూషణ్, దొరబాబు, అప్పలస్వామి, భాస్కర్ రావు, ప్రసాద్, గౌతమ్, రామారావు, రాజేష్, చిన్న, మన్మధ, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.