విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషికి గాను కార్మిక శక్తి అవార్డు
ప్రశ్న ఆయుధం మే08: కూకట్పల్లి ప్రతినిధి
ఐఎన్టియుసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీహరి ప్రసాద్ నాయుడు విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 25 సంవత్సరాలుగా చేసిన కృషికి గాను టిపిసిసి నుంచి కార్మిక శక్తి అవార్డు వచ్చిన సందర్భంగా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ .
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని ఆకాంక్షించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్. ఈ కార్యక్రమంలో శివ చౌదరి, వెంకట్ మరియు వాసు తదితరులు పాల్గొన్నారు.