Site icon PRASHNA AYUDHAM

సింగరేణి కార్మికుడు చంద్రయ్య దశదిశ కర్మకు హాజరైన నివాళులు అర్పించిన కార్మిక నాయకులు

IMG 20241216 WA0165

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 16 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
సింగరేణి మాజీ కార్మికుడు ఐ ఎఫ్ టి యు నాయకులు
ఆముదాల చంద్రయ్య దశ దిశ కార్యక్రమానికి హాజరై
చంద్రయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన నాయకులు
మణుగూరు ఏరియా సివిల్ వన్ లో పంపు ఆపరేటర్ గా పనిచేసిన స్థానిక పీకే వన్ కు చెందిన విశ్రాంత ఉద్యోగి, ఐ ఎఫ్ టి యు నాయకులు ఆముదాల చంద్రయ్య (85) దశ దిశ కార్యక్రమాలు సోమవారనాడు మణుగూరు పీకే సెంటర్ లో తన స్వగృహంలో కుటుంబ సభ్యులు జరిపారు. స్థానిక ఐ ఎఫ్ టి యు నాయకులు, మిడిదొడ్ల నాగేశ్వరరావు, నల్లా రమేష్ లు చంద్రయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నిర్బంధంలో సైతం కొండంత ధైర్యంతో నేను ఐ ఎఫ్ టి యు అని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి అని యూనియన్ పట్ల న్యూడెమోక్రసీ పార్టీ పట్ల అంకితభావం కలిగిన వ్యక్తి అని ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలలో చురుకైన కార్యకర్తగా పనిచేసిన చంద్రయ్య మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. పంచ కట్టు చంద్రన్న అంటూ ముద్దుగా పిలుచుకునే వారిమని చంద్రయ్య సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మహిళ నాయకురాలు జి మున్ని, ఐ ఎఫ్ టి యు నాయకులు ,ఆముదాల చంద్రన్న రెండవ కొడుకు శ్రీను, మిడిదొడ్ల నాగేశ్వరరావు , పెనుగొండ నాగార్జున, సాధనపల్లి రవి, నల్ల రమేష్, రాయపాటి గంగాధర్. పొనుబోయిన సంగయ్య, కే కృష్ణ,ఉపేందర్, అయితబోయిన రమేష్,పిట్టల రాంబాబు, నీరుడి శేఖర్, కురుమ్ వెంకటనారాయణ, ఎర్రసంగి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version