కార్మిక సంక్షేమమే మజ్దూర్ యూనియన్ ధ్యేయం

*కార్మిక సంక్షేమమే,మజ్దూర్ యూనియన్ ధ్యేయం*

*డివిజనల్ సెక్రటరీ పిల్లలమర్రి రవీందర్*

*జమ్మికుంట నవంబర్ 7 ప్రశ్న ఆయుధం*

భారతీయ రైల్వే, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పోరాడే ఆల్ ఇండియా రైల్యే మెన్ ఫెడరేషన్ యొక్క స్థానిక అనుబంధ సంస్థ, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ అగ్ర నాయకులైన, కామ్రేడ్ పిల్లలమర్రి రవీందర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి, కార్మిక పక్షపాత విధానాలకై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎస్ సి ఆర్ ఎం యు యొక్క జెండా గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు. రైల్వే ఉద్యోగులకు బోనస్ సాధించడంలో నాటి మజ్దూర్ యూనియన్ నాయకుల పోరాటం ఎనలేనిదని భావితరాలకు ఆదర్శం అని వారి త్యాగాలను కొనియాడారు. జమ్మికుంట బ్రాంచ్ నందు కాజీపేట మొదలు బిజిగిరి షరీఫ్ వరకు అన్ని స్టేషన్స్ యూనిట్స్ కార్మికులు డిజినల్ సెక్రెటరీ రవీందర్ కి మజ్దూర్ నాయకులకు అడుగడుగునా నీరాజనాలు తెలిపి వారిని ఘనంగా సత్కరించారు. డిసెంబర్ 4,5,6 న ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల ప్రచారంలో జమ్మికుంట శాఖ కార్యదర్శి బచ్చలి శ్రీనివాస్ చైర్మన్ ఉప్పుల రాజయ్య ట్రెజరర్ ఏ సాంబరాజు వైస్ చైర్మన్ లు బి.మొండయ్య జి. స్వప్న జి. శివ జి క్రాంతి కుమార్,అసిస్టెంట్ సెక్రటరీలు ఏం రవికుమార్, రవీందర్ ,కన్వీనర్ కుమారస్వామి,కో కన్వీనర్ ప్రవీణ్ మజ్దూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now