Site icon PRASHNA AYUDHAM

అధికారుల నిర్లక్ష్యం వలన__ దుర్గంధ వాసనలో లక్ష్మీ నగర్ వాసులు

IMG 20250617 211129

*అధికారుల నిర్లక్ష్యం వలన__ దుర్గంధ వాసనలో లక్ష్మీ నగర్ వాసులు*

*ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు…రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్*

*ప్రశ్న ఆయుధం, జూన్ 17,శేరిలింగంపల్లి,ప్రతినిధి*

మియాపూర్ డివిజన్ లక్ష్మీ నగర్ కాలనీలో డ్రైనేజీ లైన్ మళ్లించకుండా చెరువు సుందరీకరణ పేరుతో కనీస ప్రత్యామ్నాయం లేకుండా డ్రైనేజీ నీళ్లను కాలనీలోకి వదిలేయడం వలన కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు విజ్ఞప్తి చేయగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, బీజేపీ నాయకులు ,కాలనీ వాసులతో కలిసి పర్యటించి సంబంధిత జిహెచ్ఎంసి ఉప కమిషనర్, ఇరిగేషన్, వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది, లేనియెడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులను నిలదీస్తామని ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నరసింహ రాజు, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు నాగేశ్వర్ గౌడ్, మాణిక్ రావు, గణేష్, విజయేందర్, శ్రీనివాస్, శివరాజ్ ,శివారెడ్డి,రాము,పాపయ్య, మొదలవారు పాల్గొన్నారు.

Exit mobile version