నర్సిపురం గ్రామంలో పట్టాలిచ్చిన పేదలకు భూములు అప్పాజెప్పలి.

నర్సిపురం గ్రామంలో పట్టాలిచ్చిన పేదలకు భూములు అప్పాజెప్పలి.

వీరఘట్టం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా,

భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ డిమాండ్

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 26 ( ప్రశ్నఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

2008-09 సంవత్సరంలో వీరఘట్టం మండలం నర్సిపురం గ్రామంలో 151 మంది పేదలకు పట్టాలు ఇచ్చినప్పటికీ భూములు అప్పాజెప్పాలేదని ఆనాటి నుంచి నేటి వరకు లబ్ధిదారులైన పేదలు అనేక పర్యాయాలు స్థానిక తహసిల్దార్ మరియు రెవిన్యూ డివిజనల్ అధికారి పాలకొండ మరియు ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేసి చివరగా భూములు లబ్ధిదారులకు పంచుటకు సిద్ధమైన సమయంలో మరల వాయిదా పడిందని అప్పట్నుంచి ఇప్పటివరకు పేదలు పలుమార్లు తమ హక్కుగా ఉన్న భూములు కోసం ఆందోళన చేస్తూ అందులో భాగంగా ఈరోజు స్థానిక వీరఘట్టం తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో సిపిఐ పార్టీ ఆదోనిలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయగా తాసిల్దార్ కి సమస్యను వివరించితిమి దీనిపై వారు స్పందిస్తూ వాస్తవ విషయాలను పరిశీలన చేసి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ముందుగా పట్టాదారులైన పేదలతో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్, పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొత్స మోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ,వీరఘట్టం మండలం నర్సిపురం గ్రామ రెవిన్యూ పరిధిలో 2008-09 సంవత్సరంలో 151 మందికి సుమారు ఎకరం భూమి చొప్పున ఆనాటి రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన అర్హులైన పేదలకు పట్టాలిచ్చియున్నారు కానీ నేటికీ ఆ భూమిని పట్టాదారులకు పంచ లేదు. ఆ పట్టాదారులలో ఇప్పటివరకు అనేకమందికి రైతు భరోసా ఇతర ప్రభుత్వ పథకాలు అందుకొని లబ్ది పొందుతున్నారు.పట్టాలు పేదల చేతిలో ఉన్నాయి గాని భూములను అధికారులు పేదలకి దాఖలు పరచడం లేదు. పట్టాలిచ్చిన లబ్ధిదారులకు భూములు అప్పజెప్పాలని అనేకమార్లు పేదలు మండల తాసిల్దారు వారికి డివిజన్ రెవెన్యూ అధికారి వారికి జిల్లా అధికారి వారికి అనేకమార్లు విన్నవించును ఆ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన జరుగుతుంది . ఇప్పటికైనా ఎమ్మార్వో  నర్సిపురం గ్రామ పేదలకు ఇచ్చిన పట్టాలకు భూములు అప్పజెప్పాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నర్సిపురం గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేద పట్టాదారులందరూ పాల్గొన్నారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment