నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి..

నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి..

 

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి

(ప్రశ్న ఆయుధం) జూన్ 25

 

మాచారెడ్డి మండల కేంద్రంలో గురువారం నిర్వహించె కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జడ్పీటీసీ తీగల తీర్మాల్ గౌడ్, రావులపల్లి నర్సారెడ్డి, పట్టణాధ్యక్షుడు సీతారాం మధు, కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ ఇన్చార్జ్ విశ్వనాథన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహిరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ హాజరవుతారని తెలిపారు. మాచారెడ్డి లో పలు శంకుస్థాపనలు, కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభం, వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతారని తెలిపారు. కార్యక్రమానికి దోమకొండ మండలం నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కదిరి గోపాల్ రెడ్డి, నిమ్మ బాలరాజు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment