స్థానిక ఎన్నికలకు నాయకులు సిద్ధంగా ఉండాలి.
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం) జులై 18
స్థానిక ఎన్నికల సన్నాహక ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
రాబోయే స్థానిక ఎన్నికల్లో మెజార్టీ జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని తన స్వగృహంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తుగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. హడావిడిగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ మరోసారి దొంగనాటకానికి తెరలేపారని అన్నారు.అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాత ఆర్డినెన్స్ చేసిన చెల్లదని మేధావులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు.కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ పేరిట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడించారాని. తాము ఇచ్చిన హామీనే మర్చిపోయారని విమర్శించారు.సర్పంచ్, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలు వేరువేరుగా పెట్టిన ఒకేసారి పెట్టిన ఎన్నికలకు నాయకులు సిద్ధంగా ఉండాలని సూచించారు.నాయకులు గ్రామాల వారిగా మండలాల వారిగా కార్యకర్తలను సమయత్వం చేయాలని సూచించారు. ఎన్నికల్లో చెప్పిన హామీలో కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం,పెన్షన్ 4000 రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మర్చిపోయారని విమర్శించారు. ఇది ప్రజలకు వివరించి సమయత్వం చేయాలన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్న స్థానిక ఎన్నికల నిర్వహించడం లేదని కోర్టు మొట్టికాయ వేస్తే కానీ ఎన్నికలు హడావిడిగా నిర్ణయించడానికి ప్రభుత్వం సమాయత్త అయ్యిందని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.