సమాచార హక్కుచట్టం — 2005 ఆధ్వర్యంలో విద్యార్థినిలకు ఉపన్యాస పోటీలు.

కామారెడ్డి పట్టణంలోని గురువారం ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాచార హక్కుచట్ట పరిరక్షణ కమిటీ జిల్లా మహిళ విభాగం వారి సౌజన్యంతో వివిధ చట్టాలపై సెమినార్ నిర్వహించడం జరిగినది.ఇట్టి ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి అధ్యక్షత వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్దూ మీడియం ఇంటర్మీడియట్ మొదటి,ద్వితీయ సంవత్సర విద్యార్థినులు వివిధ చట్టాల పైన ఉపన్యాసాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈసందర్భంగా ప్రతిభావంతులుగా ఉపన్యాసించిన విద్యార్థినులలో ప్రధమ బహుమతి మరియు ద్వితీయ బహుమతులుగా గెలుపొందిన వారికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ఎం. చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. కార్యక్రమంలో స.హా చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా మహిళా కార్యదర్శి దొమ్మటి లలిత, పట్టణ మహిళ కార్యదర్శి ఎస్. జమున, మరియు మహిళా ప్రతినిధులు షేక్ ఇర్ఫాన, షాహినా, కళాశాల ఉర్దూ మీడియం అధ్యాపక బృందము మరియు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.