శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న శాసనసభ్యులు
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి (ప్రశ్న ఆయుధం)జూన్ 28.
మాచారెడ్డి మండల కేంద్రం చుక్కాపూర్
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామ దేవాలయాన్ని శనివారం స్థానిక శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి , సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఆలయం వద్ద రథం పెట్టడానికి రథశాల కట్టించడానికి ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం వారికి ఆలయం తరుపున శాలువాతో సన్మానించి ఆశీర్వదించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఆలయ అర్చకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.