అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడుదాం..!
-పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్
అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడుదామని పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ అన్నారు.పీ.డీ.ఎస్.యు విద్యార్థి ఉద్యమంలో అమరత్వం చెందిన విద్యార్థి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం చేర్యాలలోని గౌతమి జూనియర్ కళాశాలలో సంస్మరణ సభను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎస్వి. శ్రీకాంత్ హాజరై మాట్లాడుతూ దోపిడీ,పీడనలేని సమ సమాజం కోసం తపించి జార్జిరెడ్డి మొదలు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి , కోలాశంకర్ ,రంగవల్లి, స్నేహలత ,మారోజు వీరన్న లాంటి అనేకమంది విప్లవ వీర కిశోరాలు తమ విలువైన ప్రాణాలను అర్పించారని అన్నారు.పీ.డీ.ఎస్.యు పది దశాబ్దాల కాలంగా శాస్త్రీయ విద్యాసాధన కోసం, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే విధానాలను అవలంబిస్తుందని దానిలో భాగంగానే స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని ఆరోపించారు. పీ.డీ.ఎస్.యూ విద్యార్థి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ముగింపు సభను నవంబర్ 16వ తేదీన దుబ్బాక డివిజన్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంపత్ కుమార్ అనిల్,అంజి,రమేష్ , ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడుదాం..!
by kana bai
Published On: November 13, 2024 11:52 pm