_వికలాంగుల హక్కుల పోరాట సమితి పెన్షన్ల పెంపుకు పోరాడుదాం
_వికలాంగుల హక్కుల పోరాట సమితి
-ఈనెల 5న కామారెడ్డికి మందకృష్ణ మాదిగ
వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజ్ గౌడ్
కామారెడ్డి జిల్లా ఇంచార్జీ
(ప్రశ్న ఆయుధం )ఆగస్టు 3
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హక్కు కై పోరాడేందుకు ఈనెల 5 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి పేన్షన్ దారులు అందరు తరలి రావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కోల బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం ఒకటి గంటకు మందకృష్ణ మాదిగ కామారెడ్డికి వస్తున్నారనీ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు అందరూ ఈ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈ సభ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్ దేవునిపల్లి రోడ్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. సభా వేదికగా 4000 పెన్షన్ 6000 పెన్షన్, రెండు వేల పెన్షన్ 4000 పెన్షన్ కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటా సభకు వికలాంగుల సోదరులు, వృద్ధులు, వితంతువులు ప్రతి ఒక్కరూ హాజరై సభను విజయవంతం చేయాలన్నారు.