Site icon PRASHNA AYUDHAM

బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి జాతీయ ఉద్యమం చేద్దాం

IMG 20250612 WA0258

ఎంఈఓ స్వర్ణ జ్యోతి
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 12 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మణుగూరు మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల గాంధీ బొమ్మ సెంటరలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణ జ్యోతి మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని బాల కార్మికులుగా మారకూడదు అని పిలుపునిచ్చారు.
ఈ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఏర్పాటుచేసిన మీటింగ్ లోఎంఈఓ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున బడి ఈడు పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలని ఎవరు కూడా పని ప్రదేశంలో ఉండవద్దని తెలిపారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాల కార్మికులను రక్షించడానికి ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ మరియు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థలను అభినందించారు డైరెక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలన మరియు ఇతర శాఖల సమన్వయంతో బాల కార్మిక రహిత జిల్లాగా కలను త్వరలోనే సహకారం చేసుకుందామని గత కొంతకాలంగా ఆపరేషన్ స్మైల్స్ ముష్కన్ లాంటి ప్రత్యేక సందర్భాలలో రిస్కు ఆపరేషన్ నిర్వహించి బాల కార్మికుల్లో శ్రమదోపిడికి గురై పిల్లలను రక్షించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ లో భాగస్వామిగా ఉంటూ భారతదేశంలోని బాలల కోసం పనిచేసే అతిపెద్ద పౌర సామాజ నెట్వర్క్ పిల్లల రక్షణకు అంకితం చేయబడి 418 జిల్లాల్లో పనిచేస్తుందని బాల కార్మికులు బాల్యవివాహాలు బాలలపై లంగిక దాడులు మరియు బాలల అక్రమ రవాలకు వ్యతిరేకంగా అత్యంత చురుకుగా పోరాడుతుందని తెలిపారు బాల కార్మిక పునరావాస నిధిని ఏర్పాటు చేయడం ప్రమాదకర వృత్తుల జాబితాలో విస్తరించడం, స్థానిక అవసరాల ఆధారంగా రాష్ట్ర నిర్దిష్ట విధివిధానాలకు స్థలం సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2030 కల్లా సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు,లేబర్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు,ఎవరైనా బాండేడ్ లేబర్ గా పిల్లలను పనిలో పెట్టుకుంటే వారి మీద చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని ఫైన్లు విధిస్తామని తెలిపారు. మణుగూరు ఏరియా హాస్పిటల్ ఆర్ ఎం ఓ గౌరీ ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలందరూ పౌష్టికరమైన ఆహారం తినాలని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండాలని అలాగే బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా బడికి వెళ్లాలని సూచించారు. మణుగూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మనీషా మాట్లాడుతూ పిల్లలకి స్మార్ట్ మొబైల్స్ ఇవ్వకూడదని దానివలన చాలా చెడు పరిణామాలు ఎదురవుతున్నాయని సాధ్యమైనంత వరకు పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదని ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లాంటి యాప్లు వాడకూడదని సూచించారు, బాల కార్మికులు ఎవరైనా చూసినా కనిపించిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి లేదా తమ స్టేషన్ కి సమాచారాన్ని అందించాలని తెలిపారు ఎయిడ్ సంస్థ ఆర్గనైజర్ నాగుల జ్యోతి మాట్లాడుతూబడిబాట కార్యక్రమం ప్రారంభమైనందున ప్రజలు తల్లిదండ్రులు అధికారులు అందరూ కలిసి నూరు శాతం పాఠశాలలో నమోదు జరిగే విధంగా కృషిచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగారూపొందించడానికి కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయునీ లు ధనలక్ష్మి, కల్పనాదేవి,పద్మ ఎయిడ్ సంస్థ బాధ్యులు కుటుంబరావు, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version