హత్య చేసిన నిందితునికి జీవిత ఖైదు, 2000/- రూపాయల జరిమాన విధింపు

హత్య చేసిన నిందితునికి జీవిత ఖైదు, 2000/- రూపాయల జరిమాన విధింపు

– అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ

– నేరం చేస్తే శిక్ష తప్పదు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

తేదీ:13.07.2020 నా నీరడి ముత్తన్న (వీఆర్వో, సదాశివనగర్) ఇచ్చిన సమాచారం మేరకు, కామారెడ్డి నుండి నిజామాబాద్ వెళ్ళే నేషనల్ హైవే – 44 రోడ్డులో కల్వర్ట్ కింద గుర్తు తెలియని మగ శవం కనిపించింది. శవం ముఖం నుండి ఛాతివరకు పూర్తిగా కుళ్లిపోయి మరణం అనుమానాస్పదంగా ఉంది అని పిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు లో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగినదనీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

పరిశోధనలో భాగంగా మృతుని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను, ఇతర గ్రామస్తులను విచారించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సాంకేతిక పరిజ్ఞానం మరియు సిసి ఫుటేజ్ ఉపయోగించి గోల్కొండ రవికుమార్ ( రవి ), ( రవీందర్ ) ను నేరస్తునిగా గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు.

మృతుడు అయిన యాడల అలియాస్ మాడల సతీష్, తేదీ 10.07.2020 నా రవికుమార్ ఫోను చేసి ఇద్దరం కలుద్దామని చెప్పగా వారిద్దరూ సదాశివ నగర్ లో కలసి వైన్స్ దగ్గరికి వెళ్లి మద్యం కొనుగోలు చేసి సేవిస్తుండు మృతుడు ఇద్దరికీ గొడవ పడడం జరిగిందన్నారు. మృతుడు అతని భార్యను, భార్య బంధువులను నేరస్తుని కూడా తరచుగా తిట్టడంతో అట్టి విషయం మనసులో పెట్టుకొని నేరస్తుడైన గోల్కొండ రవికుమార్ ఎలాగైనా మృతుడు సతీష్ ను చంపాలని మనసులో పెట్టుకొని ఆర్మూర్ వెళ్దామని నమ్మించి మర్కల్ ఎక్స్ రోడ్ వైపుకు వెళుతుండగా కల్వర్టు వద్దకు చేరుకోగానే మృతుడిని కల్వర్టు దగ్గర కూర్చోబెట్టి ఆపై వంతెన పై నుండి తోసి వేయగా మృతుడు వంతెన పైనుండి కింద పడిపోగా గాయాలు అయినవి. వెంటనే నేరస్తుడు రవికుమార్ కిందకు దిగి రాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడన్నారు.

ఈ విషయములో సాక్షులను విచారించి, సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిపై కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని జిల్లా న్యాయమూర్తి సి హెచ్ వి ఆర్ ఆర్ వర ప్రసాద్ నిoదితునికి జీవిత ఖైదు, 2000 , రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినదన్నారు. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్, ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి సదా శివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్, యస్ఐ నరేశ్ , (ప్రస్తుత బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్), ప్రస్తుత సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, యస్ఐ రంజిత్. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాజయ్య, ఏఎస్సై రామేశ్వర్ రెడ్డి, సి డి ఓ ఎస్ రాజేశ్, సాయిలు లను అభినందించడం జరిగిందన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment