*ఏపీలో నేడు ఆ 4 ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదల*
*4 ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లుకు గానూ 50,541 మంది దరఖాస్తులు*
*10వ తరగతి మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశాలు*
*ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు 4% వెయిటేజ్*
అమరావతి :
ఏపీలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RJUKT) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్IT ప్రాంగణాలకు 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా సోమవారం విడుదల కానుంది. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్, లేదా ఆయన కార్యాలయ అధికారులు జాబితా విడుదల చేయనున్నారు.