హైదరాబాద్లో కిండర్ గార్డెన్ స్కూల్ ఫీజులపై బెంగళూరుకు చెందిన ఎ జూనియర్ వీసీ వ్యవస్థాపకుడు అవిరాల్ భట్నాగర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. గత ఏడాది రూ.2.30 లక్షలుగా ఉన్న LKG ఫీజు ఈ ఏడాది రూ.3.70 లక్షలకు పెరిగిందని తెలిపారు. దేశంలో రియల్ ఎస్టేట్ కంటే వేగంగా స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయని ఇదే అసలైన ద్రవ్యోల్బణం అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు.