*దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి పరీక్ష దిగ్విజయం
భూతలంపై దాడులు చేయగల దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణి (ఎల్ఆర్ఎల్ఎసీఎం)ని భారత్ మంగళవారం తొలిసారిగా పరీక్షించింది. ఒడిశా తీరానికి
చేరువలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగిన ఈ ప్రయోగం విజయవంతంగా సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎల్ఆర్ఎల్ఎసీఎంను బెంగళూరు లోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. డీఆర్డీవోకు చెందిన పలు ల్యాబ్ లు, ప్రైవేటు పరిశ్రమలు దీని రూపకల్పనలో
పాలుపంచుకున్నాయి.